

టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ను మళ్లీ భారత జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్న వేళ ఆయన తన భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సహా పలువురు మాజీ క్రికెటర్లు 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని భువనేశ్వర్కు మరో అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లకు సూచించారు. అయితే తన లక్ష్యం రీఎంట్రీ కాదని భువీ స్పష్టం చేశాడు.
ఆర్సీబీ పాడ్కాస్ట్లో మాట్లాడిన భువనేశ్వర్ కుమార్, క్రికెట్పై ఉన్న ప్రేమతోనే తాను ఐపీఎల్, దేశవాళీ క్రికెట్, యూపీ టీ20 లీగ్లో కొనసాగుతున్నానని తెలిపారు. భారత జట్టుకు ఆడాలనే తన కల ఇప్పటికే నెరవేరిందని, మరోసారి అవకాశం వస్తే ఆనందంగా స్వీకరిస్తానని చెప్పారు. అయితే తన నియంత్రణలో లేని విషయాల గురించి ఆలోచించనని, కుటుంబంతో సమయం గడుపుతూ ఆటను ఆస్వాదిస్తానని పేర్కొన్నారు. 2022లో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన భువీ ఇప్పటివరకు 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు.



















Comments (0)
No comments yet
Be the first to comment!