

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) మ్యాచ్ల నిర్వహణకు కడపలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ స్టేడియం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. జూన్ 17 నుంచి 21 వరకు రాయల్స్ ఆఫ్ రాయలసీమ, భీమవరం బుల్స్, కాకినాడ కింగ్స్, అమరావతి రాయల్స్, వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్షైనర్స్ జట్లు పోటీపడనున్నాయి. మొత్తం తొమ్మిది మ్యాచ్లలో ఐదు ఫ్లడ్లైట్ల వెలుగులో జరగనున్నాయి. సుమారు 10 వేల మంది ప్రేక్షకులు మ్యాచ్లను వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రూ.7 కోట్ల వ్యయంతో స్టేడియంలో ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. డ్రెస్సింగ్ రూములు, కార్పొరేట్ బాక్స్లు, డగౌట్స్, గ్లాస్ వ్యూయింగ్ ఏరియాలు, సైడ్ స్క్రీన్లతో స్టేడియాన్ని ఆధునికీకరించారు. విరామ సమయంలో సినీ గాయని సునీత, గీతా మాధురి సహా పలువురు కళాకారుల ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు అభిమానులను అలరించనున్నాయి. జిల్లాకు చెందిన తొమ్మిది మంది క్రికెటర్లు వివిధ జట్లకు ఎంపిక కావడం స్థానిక అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.



















Comments (0)
No comments yet
Be the first to comment!