

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక మంది నటులు తమదైన శైలిలో ముందుకు సాగుతుండగా, విక్టరీ వెంకటేష్ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఇటీవల ఆయన సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ, మల్టీస్టారర్ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. యంగ్ హీరోలతో పాటు సీనియర్ నటులతో కూడా స్క్రీన్ షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ సంవత్సరం చిరంజీవి నటించిన ‘మన శంకర్ వరప్రసాద్’ చిత్రంలో ఆయన పాత్రకు మంచి ఆదరణ లభించింది. కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే నటుడిగా వెంకటేష్ పేరు నిలిచింది.
ఇక ప్రస్తుతం వెంకటేష్ మరోసారి మల్టీస్టారర్ సినిమాకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. శర్వానంద్ నటిస్తున్న కొత్త చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. ఆ పాత్రకు ప్రాముఖ్యత ఉండటంతోనే ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్తో కలిసి మరో ప్రాజెక్ట్ చేయనున్నారు. మొత్తానికి మల్టీస్టారర్ సినిమాలంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు వెంకటేష్ కావడం విశేషం.



















Comments (0)
No comments yet
Be the first to comment!